YSRCP: వైఎస్సార్సీపీ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. వైఎస్సార్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,సీఎం రమేష్,తెలుగుదేశం పార్టీ నుంచి కనకమేడల రవీంద్రకుమార్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం మూడు స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని అంచనా. ఔట్గోయింగ్ సభ్యుల స్థానంలో ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వైఎస్ఆర్సీపీ బీసీలకు, ప్రాధాన్యత ఇచ్చినందున, ఈ సారి ముగ్గురిలో ఒకరిని ఎస్సి కమ్యూనిటీకి చెందిన వారిని ఎంపిక చేసింది . రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్సీపీ త్వరలో ప్రకటించనుంది.