NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు
    తదుపరి వార్తా కథనం
    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు
    తెలంగాణపై కేంద్రానికి జగన్ ఫిర్యాదు

    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

    వ్రాసిన వారు Stalin
    Dec 29, 2022
    10:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు.

    కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ఉమ్మడి రిజర్వాయర్‌ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భూపేంద్ర యాదవ్‌కు వివరించారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 834 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. కేఆర్‌ఎంబీ ఇండెంట్ లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తోందని జగన్ పేర్కొన్నారు

    జగన్

    'అక్రమంగా ఆ ప్రాజెక్టుల నిర్మాణం'

    తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా నదిపై ఏపీ తన వాటా హక్కులను కోల్పోతోందని తన ఫిర్యాదులో పేర్కొనారు జగన్. 2022-23లో జూన్1 నుంచి ఖరీఫ్ సీజన్‌లో విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగించడం తెలంగాణ ప్రారంభించిందని కేంద్రమంత్రికి జగన్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కోసం ఏటా 796 అడుగుల నీటిని దిగువకు విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించడం కష్టతరంగా మారిందన్నారు జగన్.

    పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే విషయంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నట్లు, ఇవీ ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు జగన్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ వై.ఎస్.జగన్
    2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే.. భారతదేశం
    ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025