NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు
    భారతదేశం

    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 29, 2022, 10:53 am 1 నిమి చదవండి
    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు
    తెలంగాణపై కేంద్రానికి జగన్ ఫిర్యాదు

    దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ఉమ్మడి రిజర్వాయర్‌ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భూపేంద్ర యాదవ్‌కు వివరించారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 834 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. కేఆర్‌ఎంబీ ఇండెంట్ లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తోందని జగన్ పేర్కొన్నారు

    'అక్రమంగా ఆ ప్రాజెక్టుల నిర్మాణం'

    తెలంగాణ ప్రభుత్వం తీరుతో కృష్ణా నదిపై ఏపీ తన వాటా హక్కులను కోల్పోతోందని తన ఫిర్యాదులో పేర్కొనారు జగన్. 2022-23లో జూన్1 నుంచి ఖరీఫ్ సీజన్‌లో విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగించడం తెలంగాణ ప్రారంభించిందని కేంద్రమంత్రికి జగన్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కోసం ఏటా 796 అడుగుల నీటిని దిగువకు విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించడం కష్టతరంగా మారిందన్నారు జగన్. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే విషయంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తున్నట్లు, ఇవీ ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు జగన్.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన విశాఖపట్టణం
    శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సినిమా
    భారత్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా టీమిండియా
    హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా హైదరాబాద్

    వై.ఎస్.జగన్

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023