NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు
    భారతదేశం

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 22, 2022, 12:55 pm 1 నిమి చదవండి
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు
    సీఎం జగన్‌పై డీఎల్ సంచలన ఆరోపణలు

    ఏపీ సీఎం జగన్‌పై సంచనల ఆరోపణలు చేశారు కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా అందులో అవినీతి కోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బైజూస్ తో ఒప్పందం విషయంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని, ఫలితంగా రూ. 1400 కోట్లు వృథా అవుతోందని సంచలన ఆరోపణపు చేశారు. తన స్నేహితుడి కుమారుడు అవినితి పాల్పడుతారని, తాను ఊహించలేదన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. మిగతా రాష్ట్రాలు బైజూస్‌ను వ్యతిరేకిస్తే.. ఏపీ ఒక్కటే ఒప్పందం చేసుకుందని దుయ్యబట్టారు. ఈ ఒప్పందం కోసం కడప జిల్లా‌కు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ ఆరోపించారు.

    'వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదు'

    ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. తాను ఇంకా వైసీపీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రావడం కష్టమే అన్నారు డీఎల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ దేవుడు కూడా కాపాడలేడని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజయితీని ప్రశ్నించలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు- పవన్ కలిసి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా దిగిజారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను పునరుద్ధరిస్తారని పేర్కొన్నారు. తాను వైసీపీలో ఉన్నందున అసహ్యంగా ఉందన్నారు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి డీఎల్ రవీంద్రారెడ్డి మంచి మిత్రుడు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    వై.ఎస్.జగన్
    వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    వై.ఎస్.జగన్

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ విశాఖపట్టణం

    వై ఎస్ రాజశేఖర్ రెడ్డి

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై.ఎస్.జగన్

    ఆంధ్రప్రదేశ్

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023