NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు
    సీఎం జగన్‌పై డీఎల్ సంచలన ఆరోపణలు

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు

    వ్రాసిన వారు Stalin
    Dec 22, 2022
    12:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ సీఎం జగన్‌పై సంచనల ఆరోపణలు చేశారు కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా అందులో అవినీతి కోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బైజూస్ తో ఒప్పందం విషయంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని, ఫలితంగా రూ. 1400 కోట్లు వృథా అవుతోందని సంచలన ఆరోపణపు చేశారు.

    తన స్నేహితుడి కుమారుడు అవినితి పాల్పడుతారని, తాను ఊహించలేదన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. మిగతా రాష్ట్రాలు బైజూస్‌ను వ్యతిరేకిస్తే.. ఏపీ ఒక్కటే ఒప్పందం చేసుకుందని దుయ్యబట్టారు. ఈ ఒప్పందం కోసం కడప జిల్లా‌కు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ ఆరోపించారు.

    జగన్

    'వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదు'

    ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. తాను ఇంకా వైసీపీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రావడం కష్టమే అన్నారు డీఎల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ దేవుడు కూడా కాపాడలేడని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజయితీని ప్రశ్నించలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు- పవన్ కలిసి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా దిగిజారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను పునరుద్ధరిస్తారని పేర్కొన్నారు. తాను వైసీపీలో ఉన్నందున అసహ్యంగా ఉందన్నారు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి డీఎల్ రవీంద్రారెడ్డి మంచి మిత్రుడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వై.ఎస్.జగన్

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025