NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్
    తదుపరి వార్తా కథనం
    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్
    తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని సీఎం జగన్ నిర్ణయం

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్

    వ్రాసిన వారు Stalin
    Jan 06, 2023
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

    డిసెంబర్ చివరి వారంలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌ల పనితీరును పరిశీలించిన జగన్, ట్యాబ్‌లలో లోపాలు లేదా మరమ్మతులు ఉంటే సరిచేసి వారం రోజుల్లో భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించాలని సూచించారు.

    జగన్

    'డీఎస్సీ -98 పోస్టింగ్‌లను త్వరగా పూర్తి చేయాలి'

    కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా‌కానుక కిట్లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలన్నారు. డీఎస్సీ -98కి సంబంధించిన పోస్టింగ్‌లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

    గోరు ముద్ద (మధ్యాహ్న భోజనం) అమలులో భాగంగా అందిస్తున్న ఆహారం నాణ్యతపై దృష్టి సారించాలని సంబంధింత అధికారులు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లో మధ్యాహ్న భోజనానికి బలవర్ధక బియ్యాన్నే వినియోగించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బెల్లం కలిపిన రాగి మాల్ట్‌ను అందించాలన్నారు.

    నాడు-నేడు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులతో మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు భూపేంద్ర యాదవ్
    పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025