NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు 
    తదుపరి వార్తా కథనం
    YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు 
    జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

    YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 02, 2024
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐ (CBI), ఈడీ (ED)కి వై.ఎస్.జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను సమర్పించమని ఆదేశించింది.

    ఈ వివరాలు రెండు వారాల్లోగా అందించాలని కోరింది. అలాగే, కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు కూడా సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

    తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్ల వివరాలను కూడా అందించాలని సూచించింది.

    కేసుల వివరాలను విడివిడిగా చార్ట్ రూపంలో సమర్పించాలి, అఫిడవిట్లతో కలిసి రెండు వారాల్లోపు అన్ని వివరాలు దాఖలు చేయాలని ఆదేశించింది.

    వివరాలు 

     విచారణ ఇంతకాలం ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించిన ధర్మాసనం 

    అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యంగా కొనసాగుతున్నట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గతంలో పిటిషన్ వేశారు.

    కేసు విచారణ ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది.

    వాదనల సమయంలో,ఇరుపక్షాల న్యాయవాదులు ఇప్పటికే రోజువారీ విచారణకు ఆదేశాలు ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగుతుందని తెలిపారు.

    కాగా,కేసు విచారణ ఇంతకాలం ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది.

    డిశ్చార్జ్,వాయిదా పిటిషన్లు,ఉన్నత కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణలే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు తెలిపారు.

    పెండింగ్‌లో ఉన్న అంశాల కారణంగానే విచారణ ఆలస్యంగా సాగుతోందని వివరించారు.ఇవి పూర్తి వివరాలతో సమర్పిస్తే తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వై.ఎస్.జగన్
    సుప్రీంకోర్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వై.ఎస్.జగన్

    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    సుప్రీంకోర్టు

    Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు  ఆంధ్రప్రదేశ్
    'Not a coffee shop...':'యా' అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం డివై చంద్రచూడ్
    Isha Foundation: ఈశా ఫౌండేషన్‌ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే   భారతదేశం
    Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. విచారణ రేపటికి వాయిదా తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025