NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విదేశాల్లో సేవా కార్యక్రమాలు
    భారతదేశం

    విదేశాల్లో సేవా కార్యక్రమాలు

    విదేశాల్లో సేవా కార్యక్రమాలు
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2022, 11:02 am 1 నిమి చదవండి
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు
    సీఎం జగన్మోహరెడ్డి పుట్టినరోజు వేడుకలు

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానులు చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ క్యాడర్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు అందజేయనున్నారు. రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు మూడు రోజులు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. తొలిరోజు క్రీడా పోటీలు నిర్వహించగా.. విశేష స్పందన లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, అనంతపురంలో ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి మొక్కలు నాటారు.

    '98 శాతం హామీలను నెరవేర్చాం'

    దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం హామీలను అమలు చేశామని, వైసీపీ అధిష్టానం చెబుతోంది. మూడున్నరేళ్లలో డీబీటీ రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,77,585.51 కోట్లు జమయ్యాయి. గృహ ప్లాట్లు, ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల ద్వారా రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనం నాన్-డిబిటి రూపంలో అందించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని 21 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్‌, వైఎస్‌ఆర్‌సీపీ సంయుక్తంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు కేంద్ర కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించి, సేవా కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రారంభించనున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    వై.ఎస్.జగన్
    వై ఎస్ రాజశేఖర్ రెడ్డి

    తాజా

    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ బీజేపీ
    ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..! టీమిండియా
    మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్ ముంబయి ఇండియన్స్
    సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్ టీమిండియా

    వై.ఎస్.జగన్

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ విశాఖపట్టణం

    వై ఎస్ రాజశేఖర్ రెడ్డి

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023