NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 
    తదుపరి వార్తా కథనం
    YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 
    జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులు అటాచ్‌

    YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 17, 2025
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

    ఈ కేసులో దాల్మియా సిమెంట్స్ సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసినట్లు ప్రకటించింది.

    ఈడీ ప్రకారం,ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.793 కోట్లు ఉంటుందని పేర్కొంది.కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి (లైమ్‌స్టోన్‌) గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేసినట్లు సమాచారం.

    అయితే, ఈ లీజు వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయని, ఇందులో జగన్ పాత్ర ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గతంలోనే ఆరోపణలు చేసింది.

    వివరాలు 

    రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్‌ ఆస్తుల అటాచ్‌

    సీబీఐ 2013లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో, జగన్ సహకారంతో దాల్మియా సిమెంట్స్ సంస్థ ఈ గనుల లీజులను నిబంధనలకు విరుద్ధంగా పొందినట్లు వివరించింది.

    అలాగే, ఈ లీజుల ద్వారా జగన్ దాదాపు రూ.150 కోట్ల మేర అక్రమంగా లాభాలు పొందినట్లు సీబీఐ పేర్కొంది.

    ఇంతేకాక, రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీలో దాల్మియా సిమెంట్స్ సంస్థ రూ.95 కోట్ల విలువైన షేర్లను పెట్టుబడిగా పెట్టినట్లు,రూ.55 కోట్లు హవాలా మార్గంలో ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, సీబీఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించింది.

    ఈ నేపథ్యంలోనే, తాజాగా ఈడీ రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను అటాచ్‌ చేయడం జరగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వై.ఎస్.జగన్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    వై.ఎస్.జగన్

    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! ముఖ్యమంత్రి
    ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు ఆంధ్రప్రదేశ్
    దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025