NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్ర‌ప్రదేశ్‌‌: గుడ్ న్యూస్ చెప్పిన  సీఎం జగన్; కొత్తగా పెన్షన్‌, రేషన్ కార్డుల జారీ 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్ర‌ప్రదేశ్‌‌: గుడ్ న్యూస్ చెప్పిన  సీఎం జగన్; కొత్తగా పెన్షన్‌, రేషన్ కార్డుల జారీ 
    ఏపీ ప్రజలకు కొత్త పెన్షన్‌, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు

    ఆంధ్ర‌ప్రదేశ్‌‌: గుడ్ న్యూస్ చెప్పిన  సీఎం జగన్; కొత్తగా పెన్షన్‌, రేషన్ కార్డుల జారీ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 24, 2023
    02:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్ర‌ప్రదేశ్‌‌ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. కొత్త పెన్షన్‌ కార్డులు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులను మంజూరు చేశారు.

    అలాగే వివిధ కారణాలతో సంక్షేమ పథకాల బకాయిలను అందుకోలేకపోయిన అర్హుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ మేరకు గురువారం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం బటన్ నొక్కగా, నిధులు ఆయా ఖాతాల్లోకి వచ్చి చేరాయి.

    2022 డిసెంబర్‌ నుంచి 2023 జూలై వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను పంపిణీ చేశారు.

    ఇదే సమయంలో కొత్తగా అర్హత సాధించిన మరో 1,49,875 మందికి పెన్షన్లను మంజూరు చేశారు.

    details

    మంచి చేసేందుకు 4 అడుగులు ముందుకేసే బాధ్యత నాదే : వైఎస్ జగన్

    కొత్తగా 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, నూతనంగా 2,00,312 మందికి రేషన్‌ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. దీంతో పెన్షన్ల సంఖ్య మొత్తం 64 లక్షల 27 వేలకు చేరుకుంది.

    గత సర్కారు హయాంలో రూ.1000 ఉన్న పెన్షన్‌ ప్రస్తుతం రూ.2750కి పెరిగింది. జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందింది.

    కులం​, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కారణం ఏదైనా పథకాల్లో లబ్ధి పొందని వారికీ ప్రత్యేకంగా నిధులను అందజేస్తున్నామన్నారు. అధికారమంటే అజమాయిషీ కాదని, ప్రజల పట్ల మమకారం చూపించడమన్నారు.

    ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేసే బాధ్యత తనదేనని ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్

    తాజా

    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ
    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్
    Shaktimaan: 'శక్తిమాన్‌' మరోసారి వస్తున్నాడు.. ఆడియో సిరీస్‌గా వచ్చేస్తున్న సూపర్‌హీరో! సినిమా

    ఆంధ్రప్రదేశ్

    AP : మదనపల్లి మార్కెట్లో టమాటా రికార్డు ధరలు.. కిలో టమాటా రూ.224  టమాట
    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు విశాఖపట్టణం
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    కడప: చంద్రబాబు రోడ్‌షోలో అగ్నిప్రమాదం చంద్రబాబు నాయుడు

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025