NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
    తదుపరి వార్తా కథనం
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
    రవీంద్రారెడ్డి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారా ?

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?

    వ్రాసిన వారు Stalin
    Dec 24, 2022
    09:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

    వైసీపీ నేతగా ఉండి.. ఆయన సీఎం జగన్‌ను విమర్శంచడం చర్చనీయాంశంగా మారింది. 2024ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని చెబుతూనే.. చంద్రబాబే రాష్ట్రానికి దిక్కు అని చెప్పడంతో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఒకవైపు జగన్‌పై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు పవన్ కల్యాణ్ నిజాయితీ మెచ్చుకున్నారు. ఇంకోవైపు రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప.. ఏ దేవుడూ కాపాడలేడని చెప్పారు. ఆయన తన రాజకీయ భవిష్యత్‍ను దృష్టిలో పెట్టుకోని ఈ మాటలన్నీ.. అన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

    రవీంద్రారెడ్డి

    ఎమ్మెల్యే టికెట్ అడిగితే.. ఎంపీ సీటు ఆఫర్?

    డీఎల్ రవీంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయన చంద్రబాబుతో మాట్లాడినట్లు సమాచారం.

    మైదుకూరు నుంచి రవీంద్రారెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి కూడా అదే సీటును డీఎల్ అడిగారట. దానికి సంబంధించి చంద్రబాబు హామీ ఇవ్వలేదట. కానీ..రాయలసీమ ప్రాంతం నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారట టీడీపీ అధినేత.

    ఉమ్మడి కడప జిల్లాలో లోక్‌సభ టిక్కెట్‌ను రవీంద్రారెడ్డికి చంద్రబాబు ఆఫర్ చేశారట. ఈ ఆఫర్‌ను డీఎల్ అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది.

    కడప వైసీపీ నేతలు కూడా డీఎల్‌కు టీడీపీ ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీలో ఉంటూనే.. టీడీపీ అధికార ప్రతినిధిలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్

    తాజా

    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!  శ్రీలంక
    World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా  పాకిస్థాన్
    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025