NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

    వ్రాసిన వారు Stalin
    Jan 31, 2023
    03:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.

    2014లో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విడిపోయాక ఏడాదిపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రా ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడ-గుంటూరు ప్రాంతంలోని అమరావతిని కొత్త రాజధానిగా రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం కొన్ని నిర్మాణాలు కూడా చేపపట్టారు. తాజాగా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారున్నట్లు జగన్ ప్రకటించడం గమనార్హం.

    వైఎస్ జగన్

    ఉగాది లోపు విశాఖకు రాజధాని తరలింపు

    త్వరలోనే విశాఖపట్నానికి రాజధాని తరలి వెళ్తుందని ఇప్పటికే చాలా సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మంత్రులు బోత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడంతో ఇక రాజధాని తరలింపు కార్యక్రమం ఉగాది లోపు ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

    2019లో ఆంధ్రప్రేదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2020లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజాధానిగా చేయాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాలతో మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం మధ్యలో కొంత వెనక్కి తగ్గినా, సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తోంది. అందుకే మళ్లీ మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ ఎత్తుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్
    ముఖ్యమంత్రి

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు భూపేంద్ర యాదవ్
    పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు

    ముఖ్యమంత్రి

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025