NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Jagan: నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి 
    తదుపరి వార్తా కథనం
    YS Jagan: నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి 
    నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి

    YS Jagan: నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్‌ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీవారి దర్శనం కోసం అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్‌ను మాజీ సీఎం వై.ఎస్.జగన్ వద్ద కూడా తీసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు.

    ముందుగానే అతిథిగృహం వద్ద ఆయనకు డిక్లరేషన్‌ ఫారాన్ని అందించి, సంతకం తీసుకోవాలని యోచిస్తున్నారు.

    జగన్‌ సంతకం చేస్తే దర్శనానికి అనుమతి ఇస్తారు, లేకపోతే దేవాదాయశాఖ చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు.

    అంటే, డిక్లరేషన్‌ పై సంతకం లేకపోతే దర్శనం అనుమతించబోరని స్పష్టమవుతోంది.

    వివరాలు 

    అప్పటి ప్రభుత్వం,టీటీడీ  ఛైర్మన్లు,ఈవో పై భక్తులు తీవ్ర విమర్శలు

    వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఆరోపణలతో పెద్ద దుమారం చెలరేగింది.

    అప్పటి ప్రభుత్వం, టీటీడీ ఛైర్మన్లు వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు తీవ్ర విమర్శలు చేశారు.

    ఇదే సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి దర్శనానికి రావడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

    అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్‌మెంటు వద్ద డిక్లరేషన్‌పై సంతకం చేయించుకుంటారు.

    వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే అతిథిగృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్‌కు కూడా ఈ విధానాన్ని పాటిస్తారు.

    వివరాలు 

    అధికారంలో ఉండగా పాటించలేదు 

    వైసీపీ పాలనలో ఉన్నప్పుడు జగన్‌ శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్‌ అవసరం లేకపోయింది.

    హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్‌ చేసినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోలేదు.

    ఇప్పుడు, డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతించాలని టీటీడీ అధికారులకు సూచనలు అందాయి.

    మరోవైపు, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని చెప్పారు. జగన్‌ ఆలయ దర్శనానికి ముందు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

    వివరాలు 

    ఏమిటీ డిక్లరేషన్‌? 

    తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనల ప్రకారం, అన్యమతస్థులు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలి.

    దేవాదాయశాఖ చట్టం 30/1987కు అనుగుణంగా, 1990లో అప్పటి ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును (జీఓ) జారీ చేసింది.

    ఆ జీఓ ప్రకారం, హిందువు కాని వ్యక్తులు లేదా అన్యమతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్‌ ఫారంపై సంతకం చేయాలి.

    తమది వేరే మతమని, అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున దర్శనం కోసం అనుమతి కోరుతూ, సంతకం చేసి వివరాలు నమోదు చేయాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి
    వై.ఎస్.జగన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుపతి

    వై.ఎస్.జగన్

    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్
    పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్
    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025