NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Govt: జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్.. సరస్వతి పవర్‌లో అసైన్డ్‌ భూములను వెనక్కి
    తదుపరి వార్తా కథనం
    AP Govt: జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్.. సరస్వతి పవర్‌లో అసైన్డ్‌ భూములను వెనక్కి
    జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్.. సరస్వతి పవర్‌లో అసైన్డ్‌ భూములను వెనక్కి

    AP Govt: జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్.. సరస్వతి పవర్‌లో అసైన్డ్‌ భూములను వెనక్కి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది.

    ఈ చర్యలో భాగంగా పల్నాడు ప్రాంతంలోని భూములను స్వాధీనం చేసుకుంటూ స్థానిక తహసీల్దార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

    కొన్ని రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ భూములను పరిశీలించారు.

    జగన్ భూములను అక్రమంగా చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై జగన్ తన స్పందనను తెలియజేస్తూ, సంబంధిత అధికారుల నివేదికలను ప్రస్తావించారు.

    వివరాలు 

    1324.93 ఎకరాల భూమి అక్రమంగా కబ్జా

    జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు వైఎస్ హయాంలో భూముల కేటాయింపు జరిగింది, అయితే అప్పటి నుంచే ఈ కేటాయింపులపై వివాదం చోటు చేసుకుంది.

    అనంతరం ఈడీ కూడా ఈ భూములను అటాచ్ చేసింది. జగన్, షర్మిల వివాదం నేపథ్యంలో సరస్వతి పవర్ సంబంధిత అంశాలపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.

    ఇటీవల పవన్ పరిశీలన సమయంలో, 1324.93 ఎకరాల భూమి అక్రమంగా కబ్జా అయ్యిందని ఆరోపించారు.

    అంతేకాకుండా, ఈ భూముల్లో 34 ఎకరాల అసైన్డ్ భూమి కూడా ఉందని పవన్ పేర్కొన్నారు.

    తాను అధికారంలో ఉన్న సమయంలో ఈ భూములను 50 ఏళ్లకు లీజుగా తీసుకున్నట్టు జీవో జారీ చేయించారని ఆయన ఆరోపించారు.

    వివరాలు 

    పల్నాడులోని సరస్వతి పవర్‌లో 17.69 ఎకరాల అసైన్డ్ భూములు 

    ఈ ఆరోపణలపై జగన్ మాట్లాడుతూ, తన ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించి, ఎలాంటి ప్రభుత్వ భూములు కబ్జా చేయలేదని నివేదికలో తేలిందని స్పష్టంచేశారు.

    గతంలో చంద్రబాబు ప్రభుత్వం భూములపై నిర్ణయం తీసుకోవడంతో కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.

    జగన్ వివరించగా,ఇతర సంస్థలు ఇచ్చిన ధర కంటే ఎక్కువ చెల్లించి ఈ భూములను పొందినట్టు తెలిపారు.

    ఇప్పుడు ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలో భాగంగా పల్నాడులోని సరస్వతి పవర్‌లో 17.69 ఎకరాల అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది.

    ఇందులో మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు,పిన్నెల్లిలో 3.89 ఎకరాలు ఉన్నాయి.

    ఈ మేరకు స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో,జగన్ ప్రభుత్వం నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    AP News: PAC ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు? భారతదేశం
    AP legislative council: 8 కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం భారతదేశం
    PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..? భారతదేశం
    CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు

    వై.ఎస్.జగన్

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025