NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా
    తదుపరి వార్తా కథనం
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా
    విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా

    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 13, 2023
    12:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఈ మేరకు పలువురు నాయకులు, వివిధ కారణాలతో పార్టీ జెండాలను, కండువలను మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

    ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో అధికార పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వైసీపీని వీడినట్లు ప్రకటించారు.

    తనను నమ్ముకున్న కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

    పార్టీని వీడి వెళ్లడం తనకు వేదన మిగిల్చిందని ఆందోళన వెలిబుచ్చారు. 2009లో ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసిన రమేశ్ బాబు, పెందుర్తి నుంచి పీఆర్పీ తరఫున బరిలోకి దిగి విజయదుందుభి మోగించారు.

    DETAILS

    2020లో వైసీపీ కండవా కప్పుకున్న రమేశ్ బాబు 

    అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. ఈ మేరకు రమేశ్ హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ తీరును నిరసిస్తూ విడ్కోలు పలికారు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ గా విడిపోయాక 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలిచి నిలబడ్డారు.

    తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 2020లో రమేశ్, వైసీపీ కండువా కప్పుకున్నారు. చివరకు 2024 ఎన్నికల ముంగిట తాజాగా ఆ పార్టీని సైతం వీడటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు  విశాఖపట్టణం
    బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్  బాపట్ల
    ఏపీలో నయా పాలిటిక్స్: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం భారతదేశం
    నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు తెలంగాణ

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు ఆంధ్రప్రదేశ్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025