NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SEBI: ఆయిల్ కంపెనీలపై BSE , NSE భారీ జరిమానాలు
    తదుపరి వార్తా కథనం
    SEBI: ఆయిల్ కంపెనీలపై BSE , NSE భారీ జరిమానాలు
    SEBI: ఆయిల్ కంపెనీలపై BSE , NSE భారీ జరిమానాలు

    SEBI: ఆయిల్ కంపెనీలపై BSE , NSE భారీ జరిమానాలు

    వ్రాసిన వారు Stalin
    May 26, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ఆయిల్ (IOC), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), GAIL (ఇండియా) లిమిటెడ్‌తో సహా అనేక ప్రభుత్వ రంగంలోని చమురు గ్యాస్ కంపెనీలపై జరిమానా విధించారు.

    వరుసగా నాల్గవ త్రైమాసికంలో జరిమానా విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    నిబంధనలను పాటించకపోవడమే కారణంగా కనిపిస్తోంది. అందుకే BSE , NSEలు వాటిపై జరిమానా విధించాయి.

    ప్రత్యేకంగా వారి బోర్డులలో అవసరమైన సంఖ్యలో డైరెక్టర్లు లేకపోవడం కారణంగా ఉంది.

    స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌ల ప్రకారం,జనవరి-మార్చి త్రైమాసికంలోనిబంధనలను పాటించలేదు.

    దీనితో ఈ కంపెనీలపై 34 లక్షల సంచిత ( క్యుములేటివ్ ) జరిమానా విధించారు. ఐఓసీ, ఓఎన్‌జీసీ, గెయిల్‌తో పాటు ,(బీపీసీఎల్),ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)లపై బోర్డు లోపాలపై ఈ కంపెనీలకు జరిమానా విధించారు.

    Details

    ఈ కంపెనీలు జరిమానాలను ఎదుర్కోవడం నాలుగో సారి 

    వీటితో పాటుగా (హెచ్‌పీసీఎల్) , (ఎంఆర్‌పీఎల్)లకు కూడా జరిమానా విధించారు.

    మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో అవసరమైన సంఖ్యలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు , తప్పనిసరి మహిళా డైరెక్టర్‌లను చేరుకోవడంలో ఈ కంపెనీలు విఫలమయ్యాయి.

    అందుకు గాను BSE , NSEలు జరిమానాలు విధించాయి.ఈ కారణంగా ఈ కంపెనీలు జరిమానాలను ఎదుర్కోవడం వరుసగా ఇది నాలుగో త్రైమాసికం.ఈ జరిమానాలపై కంపెనీలు స్టాక్ ఎక్సేంజ్ బోర్డులకు బదులిచ్చాయి.

    డైరెక్టర్‌ల నియమకాల్లో తమ పాత్రలేదని ప్రభుత్వ నిర్ణయాలే శిరోధార్యమని చెప్పాయి.

    Details

    డైరెక్టర్ల నియామకం ప్రభుత్వ బాధ్యత 

    డైరెక్టర్ల నియామకం ప్రభుత్వ బాధ్యత అని BSE , NSEలకు నివేదించాయి.ప్రత్యేకంగా, IOC "డైరెక్టర్లను (స్వతంత్ర డైరెక్టర్లతో సహా) నియమించే అధికారం భారత ప్రభుత్వంలోని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు ఉంటుందని పేర్కొంది.

    బోర్డు అవసరాలను తీర్చడంలో తమ వైఫల్యం లేదని చెప్పాయి. తమ పక్షాన ఎలాంటి నిర్లక్ష్యం , ఫొరపాట్లు లేవని అవి వాదించాయి.

    పర్యవసానంగా ఈ జరిమానాలను మినహాయించాలని IOC అభ్యర్థించింది.

    Details

    ఇతర కంపెనీల జరిమానాలను రద్దు చేయాలి 

    తమపై విధించిన జరిమానాలను రద్దు చేయాలని IOC.. BSE , NSEలను కోరాయి. HPCL , BPCL IOCకూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి.

    డైరెక్టర్ల నియామకం తమ నియంత్రణకాదని, తమ పాత్ర చిన్నదని తెలిపింది.. ఇటువంటి నియామకాలు తమ అధికార పరిధికి లోకి రావని గెయిల్ పేర్కొంది.

    కాగా, స్వతంత్ర డైరెక్టర్ల నియామకం కోసం OIL మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది.

    MRPL తన బోర్డులో అవసరమైన సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్ల నియామకం కోసం మంత్రిత్వ శాఖను నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025