NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 
    ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు..

    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి.

    గ్లోబల్‌గా నెలకొన్న భౌగోళిక,రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఫలితంగా ప్రారంభంలో స్థిరంగా ప్రారంభమైన సూచీలు తర్వాత నెగటివ్‌ వైపుకు జారుకున్నాయి.

    ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 66 పాయింట్ల నష్టంతో 80,204 స్థాయిలో ట్రేడవుతుండగా, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24,305 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్‌కు చెందిన 30 షేర్లలో బజాజ్ ఫిన్‌సర్వ్‌,బజాజ్ ఫైనాన్స్‌,ఇండస్‌ఇండ్ బ్యాంక్‌,టాటా మోటార్స్‌,ఎస్‌బీఐ,ఎటర్నల్‌,టాటా మోటార్స్‌, ఏషియన్ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    అదే సమయంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    బంగారం ఔన్సు ధర 3,318.60 డాలర్లు 

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 63.80 డాలర్ల వద్ద ఉంది.

    బంగారం ఔన్సు ధర 3,318.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి.

    డోజోన్స్‌ సూచీ 0.75 శాతం పెరగ్గా,ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.58 శాతం,నాస్‌డాక్‌ సూచీ 0.55 శాతం లాభాలను నమోదు చేశాయి.

    ఈ ప్రభావంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా లాభపథంలో కదలాడుతున్నాయి.ఆస్ట్రేలియాలోని ASX సూచీ 0.22 శాతం,జపాన్ నిక్కీ 0.17 శాతం లాభపడుతుండగా,చైనా షాంఘై మార్కెట్‌ మాత్రం 0.09 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

    వివరాలు 

    రూ.1,369 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన DIIs

    విదేశీ సంస్థాగత మదుపుదారులు (FIIs) తిరిగి కొనుగోలుదారులుగా కనిపిస్తున్నారు.

    వరుసగా పదవ ట్రేడింగ్‌ సెషన్‌ కూడా వారు కొనసాగిస్తూ, రూ.2,386 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.

    ఇదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపుదారులు (DIIs) కూడా రూ.1,369 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    స్టాక్ మార్కెట్

    Stock Market :భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు..  సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌  బిజినెస్
    Pharma Stocks Crash: ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాల ప్రకటన.. భారీ నష్టాల్లో ఫార్మా స్టాక్స్ వ్యాపారం
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹10 లక్షల కోట్లు ఆవిరి బిజినెస్
    JP morgan: ట్రంప్‌ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025