Page Loader
Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల
వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల

Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల మధ్య కూడా విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో, మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లు మంచి రికవరీ కనబర్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను ముందుకు తీసుకువెళ్లింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకుపైగా పెరిగి 80,218.37 వద్ద ముగిసింది. నిఫ్టీ 24,300 ఎగువకు చేరి 24,328.50 వద్ద స్థిరపడింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలను మదుపర్లు సజాగ్రంగా గమనించాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Details

మార్కెట్ గమనిక 

సెన్సెక్స్ ఉదయం స్వల్ప లాభాల్లో 79,343.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 80,321.88 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి చివరకు 1005.84 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 289.15 పాయింట్ల లాభంతో 24,328.50 వద్ద ముగిసింది. రూపాయి విలువ డాలరుతో పోల్చితే 37 పైసలు బలపడి 85.04 వద్ద నిలిచింది. లాభపడిన, నష్టపోయిన షేర్లు ఇవే సెన్సెక్స్ 30 షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధాన లాభదారులుగా నిలిచాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్ షేర్లు నష్టపోయాయి.

Details

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు ధర 3,288 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Details

 మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు 

1. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలు అంచనాలను మించి మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో కంపెనీ షేరు దాదాపు 5 శాతం పెరిగి రూ.1366కు చేరుకుంది. 2. బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మార్కెట్‌ను దన్నిచేశాయి. 3. విదేశీ మదుపు ప్రవాహం గత 8 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌ఐఐలు సుమారు రూ.32,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. 4. అంతర్జాతీయ పాజిటివ్ ట్రెండ్స్ అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందానికి అవకాశాలపై మార్కెట్లలో పాజిటివ్ భావన పెరిగింది. 5. ముందు సాగుతున్న భారత్-పాక్ ఉద్రిక్తతలు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, డాలర్ బలహీనత, స్థిరమైన క్రూడాయిల్ ధరలు మార్కెట్లను ఊతమిచ్చాయి.