NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
    స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 12, 2025
    04:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను ప్రభావితం చేశాయి.

    అమెరికాలో ఆర్థిక వృద్ధి మందగమనం కారణంగా మాంద్యం వచ్చే ప్రమాదం ఉందనే భయాలతో దేశీయ ఐటీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

    ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు సూచీలకు కొంత మద్దతునిచ్చాయి.

    ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ యాజమాన్యం మదుపర్ల నమ్మకాన్ని పెంచే ప్రకటనలు చేయడంతో నిన్న భారీగా పతనమైన బ్యాంక్‌ షేర్లు ఇవాళ 5 శాతం మేర లాభపడ్డాయి.

    వివరాలు 

    సెన్సెక్స్‌ & నిఫ్టీ పరిస్థితి

    సెన్సెక్స్‌ ఉదయం 74,270.81 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 74,102.32) లాభాల్లో ప్రారంభమైంది.

    అయితే, కొన్ని క్షణాల్లోనే నష్టాల్లోకి వెళ్లి స్వల్పంగా కోలుకుంది.

    ఇంట్రాడేలో 73,598.16 - 74,392.15 పాయింట్ల మధ్య మారుతూ చివరకు 72.56 పాయింట్ల నష్టంతో 74,029.76 వద్ద ముగిసింది.

    నిఫ్టీ 27.40 పాయింట్లు కోల్పోయి 22,470.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.21గా ఉంది.

    వివరాలు 

    స్టాక్స్‌ లాభనష్టాలు: 

    సెన్సెక్స్‌ 30 సూచీల్లో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోయాయి.

    ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

    అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 70.23 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,922 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    స్టాక్ మార్కెట్

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 199, నిఫ్టీ 102 పాయింట్లు  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market : బేర్ పట్టు నుంచి కాస్త విరామం .. స్వల్ప లాభాలలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 22,959 బిజినెస్
    Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025