LOADING...
Stock Market: నాలుగో రోజు కూడా లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌.. 24,430 దాటిన నిఫ్టీ
నాలుగో రోజు కూడా లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌.. 24,430 దాటిన నిఫ్టీ

Stock Market: నాలుగో రోజు కూడా లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌.. 24,430 దాటిన నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగో వరుస రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, కంపెనీల తొలి త్రైమాసిక (Q1) ఫలితాలపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆశావహ అంచనాలు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు రోజు మొత్తం సానుకూల ధోరణిలో కొనసాగాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 521 పాయింట్లు పెరిగి లాభాలతో ముగిసింది. మరోవైపు నిఫ్టీ 159.50 పాయింట్లు ఎగిసి 24,430.35 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ 24,400 మార్కును దాటి ముగిసింది.

వివరాలు 

రూపాయి విలువ రూ.95.38

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీఈఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకి షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.95.38 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.50 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్స్‌ ధర 4,148.34 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement