NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 720 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్ల నష్టం 
    తదుపరి వార్తా కథనం
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 720 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్ల నష్టం 
    భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 720 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్ల నష్టం

    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 720 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్ల నష్టం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలు చవిచూశాయి. గత గురువారం దాదాపు 2 శాతం లాభపడిన సూచీలు, ఈ రోజు తిరిగి నష్టాల వైపు మళ్లాయి.

    మదుపర్లు లాభాలు స్వీకరించడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొనబడింది.

    ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి పెద్ద షేర్లలో అమ్మకాలు ఎక్కువవడంతో సూచీలు క్షీణించాయి.

    సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది, కాగా నిఫ్టీ 24 వేల మార్కు పైగా ముగిసింది.

    సెన్సెక్స్‌ ఉదయం 80,072.99 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది, కానీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్‌ ధర 75.61 డాలర్లు 

    ఇంట్రాడేలో దాదాపు 900 పాయింట్లు కోల్పోయి, 79,109.73 వద్ద కనిష్ఠ స్థాయికి చేరింది.

    చివరకు 720.60 పాయింట్లు నష్టపోయి, 79,223.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 207.25 పాయింట్ల నష్టంతో 23,981.40 వద్ద ముగిసింది. రూపాయి డాలర్‌తో మార్పిడి విలువ 85.78 వద్ద క్షీణించింది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా మోటార్స్‌, టైటాన్‌, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్‌, రిలయన్స్‌ షేర్లు మాత్రం లాభపడాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ ధర 75.61 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2670 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    వివరాలు 

    బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ రంగాలలో అమ్మకాల ఒత్తిడి

    స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైనవి బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ రంగాలలో అమ్మకాల ఒత్తిడి.

    ఈ రంగాల్లోని షేర్లు 1 శాతం వరకు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి ప్రధాన షేర్లలో లాభాలు స్వీకరించడం, తద్వారా సూచీలపై ఒత్తిడి పెరిగింది.

    మరోవైపు, త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభం, డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షంగా బాధ్యతలు చేపట్టడం వంటి అంశాలు కూడా మదుపర్లలో అప్రమత్తతను పెంచాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    స్టాక్ మార్కెట్

    Stock market:  నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 58 పాయింట్లు చొప్పున నష్టం  సెన్సెక్స్
    Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ  బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 పైన ట్రేడవుతున్న నిఫ్టీ  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025