NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు
    న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు

    Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 01, 2025
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2025 నూతన సంవత్సరాన్ని ఫ్లాట్‌గా స్వాగతించాయి.

    మొదటి రోజు తీవ్ర ఊగిసలాటకు లోనవుతూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

    ఈ నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 78,070 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 26 పాయింట్లు కుంగి 23,618 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీ, జొమాటో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    నష్టాల్లో అమెరికా మార్కెట్లు 

    కానీ, అల్ట్రా టెక్ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ.78.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.ప్రధాన సూచీలు అయిన ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ 1 శాతం మేర నష్టాలు చవిచూసాయి.

    వివరాలు 

    నేడు మిశ్రమంగా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు 

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి,అయితే హాంకాంగ్ హాంగ్‌సెంగ్ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగుతోంది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) అమ్మకాల పర్వం కొనసాగిస్తూ, మంగళవారం నికరంగా రూ.4,645 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు.

    కాగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,547 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    స్టాక్ మార్కెట్

    Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్! బిజినెస్
    Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. త్వరలో వెలువడనున్న ఆర్బీఐ కొత్త పాలసీ బిజినెస్
    Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025