NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 260 పాయింట్లు.. నిఫ్టీ 24,600 పాయింట్లు 
    తదుపరి వార్తా కథనం
    Stock market: నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 260 పాయింట్లు.. నిఫ్టీ 24,600 పాయింట్లు 
    నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    Stock market: నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 260 పాయింట్లు.. నిఫ్టీ 24,600 పాయింట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

    బలహీన అంతర్జాతీయ సంకేతాలతో పాటు, బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనుండటం వల్ల మదుపర్లు అప్రమత్తంగా ఉండడం, మార్కెట్‌ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

    ప్రారంభంలోనే సెన్సెక్స్ 260 పాయింట్లు పడిపోయి, నిఫ్టీ 24,600 పాయింట్ల కింద ట్రేడవుతోంది.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 210 పాయింట్లు తగ్గి 81,537 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు కుంగి 24,598 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది

    సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    బంగారం ఔన్సు ధర 2,672.90 డాలర్ల వద్ద, డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.92 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

    అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు అదే ధోరణిలో ఉన్నాయని తెలుస్తోంది.

    ఆస్ట్రేలియా ASX 0.82%, జపాన్ నిక్కీ 0.16% లాభంతో ట్రేడవుతున్నాయి, కాగా హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.52% మరియు షాంఘై 0.52% నష్టాల్లో ఉన్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.279 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా రూ.234 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    BLA: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ! పాకిస్థాన్
    Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు ఆంధ్రప్రదేశ్
    IndiaAI మిషన్‌లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం టెక్నాలజీ
    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్

    స్టాక్ మార్కెట్

    Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు  హైదరాబాద్
    Stock Market: స్టాక్ మార్కెట్ ద్వారా లక్ష కోట్ల డాలర్ల సంపద.. నివేదికిచ్చిన మోర్గాన్ స్టాన్లీ వ్యాపారం
    Stock Market: 200 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 23,500 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ  సెన్సెక్స్
    Share Market: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో క్షీణత..ఇవే కారణాలు కావచ్చు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025