NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 1,130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌..!
    తదుపరి వార్తా కథనం
    Stock Market: భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 1,130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌..!
    భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 1,130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌..!

    Stock Market: భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 1,130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం గణనీయమైన లాభాలను నమోదుచేశాయి.

    చాలా రోజుల తరువాత సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పెరగడం విశేషం. దీనివల్ల సెన్సెక్స్ 75,000 పాయింట్లకు పైగా ముగిసింది, ఇక నిఫ్టీ 23,000 పాయింట్లకు చేరువైంది.

    అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూలమైన వాతావరణం, బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లతో మార్కెట్లు లాభాలను సొంతం చేసుకున్నాయి.

    మునుపటి సెషన్‌తో పోలిస్తే, సెన్సెక్స్ 74,608.66 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది.

    ప్రారంభంలోనే ఇది 400 పాయింట్లకు పైగా పెరిగింది. అనంతరం సూచీలు మరింత పెరుగుతూ ముందుకు సాగాయి.

    ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠంగా 74,480.15 పాయింట్లను తాకగా, గరిష్ఠంగా 75,385.76 పాయింట్లను చేరుకుంది.

    వివరాలు 

    లాభపడిన 2,715 షేర్లు

    చివరికి 1,131.30 పాయింట్ల లాభంతో 75,301.26 వద్ద స్థిరపడింది. అదే విధంగా, నిఫ్టీ 325.55 పాయింట్లు పెరిగి 22,834.30 వద్ద ముగిసింది.

    మొత్తం 2,715 షేర్లు లాభపడగా, 1,153 షేర్లు నష్టపోయాయి, మరో 117 షేర్ల ధరల్లో మార్పులుండలేదు.

    నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా వంటి షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

    అన్ని రంగాల సూచీలలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, పవర్, రియాల్టీ, మీడియా ఇండెక్స్‌లు 2% నుంచి 3% వరకు పెరిగాయి.

    బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ఒక్కొక్కటి 2% కి పైగా లాభపడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Operation Sindoor: భారత్,పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. డ్రోన్ దాడి జరిగే అవకాశం ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్
    Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో .. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు రద్దు పరీక్షలు
    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్

    స్టాక్ మార్కెట్

    Stock market: బ్యాంక్‌ షేర్లు పతనం.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు వ్యాపారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900 బిజినెస్
    Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ నిర్ణయాలే కారణం బిజినెస్
    FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి? వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025