Page Loader
Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (స్టాక్ మార్కెట్) సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 383.01 పాయింట్లు తగ్గి 75,807 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 116.1 పాయింట్లు పడిపోయి 22,976 వద్ద కదలాడుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 86.44 వద్ద నిలిచింది (స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ బెల్). బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

వివరాలు 

కీలకంగా మారనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు

కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు మదుపర్లు ఆశించిన మేర ఉండకపోవచ్చన్న అభిప్రాయాలతో పాటు, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు నిరాశజనకంగా ఉండటం కూడా ఈ నష్టాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశ నిర్ణయాలు కీలకంగా మారనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.