NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్‌.. 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్‌.. 
    నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్‌..

    Stock Market: నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్‌.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 31, 2024
    09:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న బలహీన సంకేతాలతో సూచీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

    ఈ నేపథ్యంలో, మంగళవారం సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

    మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 360 పాయింట్లు నష్టంతో ప్రారంభమైంది, కాగా నిఫ్టీ 23,500 పాయింట్ల పైగా కదలాడింది.

    ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 459 పాయింట్ల నష్టంతో 77,818 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 23,539 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    బంగారం ఔన్సు ధర 2,619.40 డాలర్లు 

    సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, జొమాటో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, యాక్సిస్ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    మరోవైపు, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్‌, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    బంగారం ఔన్సు ధర 2,619.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.61 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

     నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

    అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రధాన సూచీలు ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ 1 శాతం మేర నష్టాల్లో ముగిశాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

    జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్‌ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగుతోంది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తమ అమ్మకాల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు, సోమవారం కూడా రూ.1,893 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు.

    దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,174 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం
    IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా? ఐపీఎల్
    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,450 ఎగువకు నిఫ్టీ బిజినెస్
    Stock Market Opening Bell: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్! బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025