NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 
    సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..

    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు కనిపించడంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

    ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో మార్కెట్‌ బలంగా నిలిచింది.

    ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 387 పాయింట్లు లాభపడి 81,517 స్థాయిలో కొనసాగింది. అదే సమయంలో నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 24,696 వద్ద ట్రేడవుతోంది.

    సెన్సెక్స్‌-30 సూచీలో టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎటర్నల్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 86.18డాలర్లు 

    మరోవైపు,టాటా మోటార్స్‌, ఏషియన్ పెయింట్స్‌, నెస్లే ఇండియా,ఇండస్‌ఇండ్ బ్యాంక్‌,అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 86.18డాలర్ల వద్ద ఉండగా,బంగారం ధర ఔన్సు దాదాపు 3,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    అమెరికా స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే,నాస్‌డాక్‌,ఎస్ అండ్ పీ 500 సూచీలు నిన్నటివరకు లాభాల్లో ముగిశాయి.

    అయితే డోజోన్స్ సూచీ మాత్రం స్థిరంగా ముగిసింది.ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.

    ఆస్ట్రేలియన్ ASX సూచీ 0.11 శాతం నష్టాన్ని చూపిస్తుండగా,జపాన్ నిక్కీ సూచీ 0.81 శాతం నష్టపోయింది.

    మరోవైపు, షాంఘై మార్కెట్‌ 1.42 శాతం లాభపడగా,హాంకాంగ్‌లోని హాంగ్‌సెంగ్ సూచీ 0.21 శాతం లాభంలో ఉంది.

    వివరాలు 

    రూ.477 కోట్ల విలువైన షేర్ల విక్రయం 

    విదేశీ సంస్థాగత మదుపుదారులు (FIIs) మళ్లీ అమ్మకాల వైపుకు మొగ్గు చూపారు.

    మంగళవారం వారు నికరంగా రూ.477 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

    అంతకుమేపుగా దేశీయ సంస్థాగత మదుపుదారులు (DIIs) భారీగా కొనుగోళ్లు చేసి, నికరంగా రూ.4,274 కోట్ల విలువైన షేర్లను సేకరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..  స్టాక్ మార్కెట్
    Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..! మహ్మద్ షమీ
    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం  ద్రౌపది ముర్ము
    Tech Layoffs: భారీ లేఆఫ్స్ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు.. దాదాపు 6 వేల మంది తొలగింపుకు ప్రణాళిక సిద్ధం మైక్రోసాఫ్ట్

    స్టాక్ మార్కెట్

    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు బిజినెస్
    Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు  బిజినెస్
    Stock Market : భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు ప్లస్‌ బిజినెస్
    Stock Market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 855, నిఫ్టీ 273 పాయింట్లు చొప్పున లాభం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025