LOADING...
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. ఐటీ షేర్లతో నిలదొక్కుకున్న సూచీలు
ఐటీ షేర్లతో నిలదొక్కుకున్న సూచీలు

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. ఐటీ షేర్లతో నిలదొక్కుకున్న సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చన్న ఆందోళనలు, రూపాయి విలువ బలహీనపడడం వంటి కారణాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే తరువాత ఐటీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు క్రమంగా కోలుకుని చివరకు స్థిరంగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపు 75,237.99 పాయింట్లతో పోలిస్తే 74,807.97 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రారంభ దశలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా క్షీణించి ఇంట్రాడేలో 74,180.26 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్‌ తిరిగి కోలుకుంది. చివరకు సెన్సెక్స్‌ 77.05 పాయింట్ల లాభంతో 75,315.04 వద్ద ముగిసింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 111 డాలర్లు 

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ప్రారంభంలో ఒడిదుడుకులకు లోనైనా చివరకు 6.45 పాయింట్లు పెరిగి 23,649.95 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.33గా నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 111 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 4541 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement