
FASTag annual pass: ప్రైవేట్ వాహనదారులకు సూపర్ ఆఫర్.. ఫాస్టాగ్ పాస్తో నిరంతర ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
టోల్గేట్ల వద్ద సమయనష్టాన్ని తగ్గిస్తూ, ఫాస్టాగ్ ఆధారితంగా 'వార్షిక పాస్' తీసుకురానున్నట్లు వెల్లడించింది.
ఈ పాస్ను ఈ ఏడాది ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Details
రూ.3వేల చార్జితో ఏడాది పాటు ప్రయోజనం
ఈ యాన్యువల్ పాస్ కోసం వాహనదారులు రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది.
ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత ఏదైనా ఒకటే - ఏడాది లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుందని తెలిపారు.
ఇది నాన్-కమర్షియల్ వాహనాలు అయిన కార్లు, జీపులు, వ్యాన్లు మొదలైన వాటికే వర్తిస్తుంది.
దేశవ్యాప్తంగా అన్ని టోల్గేట్లపై అమలు
ఈ పాస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై పని చేస్తుందన్న గడ్కరీ, త్వరలోనే దీనికి సంబంధించిన యాక్టివేషన్ లింక్ను విడుదల చేయనున్నట్లు చెప్పారు.
రాజ్మార్గ్ యాప్, NHAI, MoRTH వెబ్సైట్లు వంటి వేదికల్లో ఈ లింక్ అందుబాటులోకి రానుంది.
Details
ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్కు పరిష్కారం
ప్రయాణికులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఈ విధానాన్ని చివరికి అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
టోల్ ప్లాజాల వద్ద జామ్లు, వాహనదారుల మధ్య వాగ్వివాదాలను తగ్గించే దిశగా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు సౌకర్యవంతమైన, నిరాటంక ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం అమలైతే ప్రయాణికుల కోసం ఒక క్రాంతికారమైన మార్గంగా మారనుంది.