NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం?.. మధ్య తరగతి వారికి ప్రయోజనం పొందేలా చర్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం?.. మధ్య తరగతి వారికి ప్రయోజనం పొందేలా చర్యలు
    కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం?..

    Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం?.. మధ్య తరగతి వారికి ప్రయోజనం పొందేలా చర్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

    ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించనున్నట్లు సమాచారం.

    నిపుణులు ఈ కొత్త పన్ను విధానంతో పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

    రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపును ఇవ్వనున్నారు.

    అంతేకాక, రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయం గల పన్ను చెల్లింపుదారులకు 25 శాతం పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది.

    గత ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000కి పెరిగింది.

    వివరాలు 

    రూ. 10 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు

    దీనివల్ల వార్షిక ఆదాయం రూ. 7.75 లక్షల వరకు ఉన్న వేతన పన్ను చెల్లింపుదారులు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

    అయితే, వార్షిక ఆదాయం రూ. 15 లక్షల పైగా ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

    మరోవైపు, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, రూ. 10 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు అమలు చేయడం వలన ప్రభుత్వం ఏటా రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు నష్టపోవచ్చని అంచనా వేస్తున్నారు.

    అయితే, ఈ నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమై ఉందని పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు మధ్యతరగతికి పన్ను రాయితీ ఇచ్చి వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వానికి సూచించారు.

    వివరాలు 

    పాత ఆదాయపు పన్ను విధానంలో రూ. 10 లక్షలపై 30 శాతం పన్ను

    పన్ను భారం తగ్గించడం వలన ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుందని, దానివల్ల ఖర్చులు పెరిగి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించగలుగుతుందని భావిస్తున్నారు.

    ప్రస్తుతం, పాత ఆదాయపు పన్ను విధానంలో రూ. 10 లక్షలపై 30 శాతం పన్ను విధించబడుతుంది.

    కానీ, కొత్త విధానంలో రూ. 15 లక్షలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

    గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.4 శాతానికి తగ్గిన నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోకుండా ఉండాలంటే, మధ్యతరగతి పన్ను భారం తగ్గించి వినియోగాన్ని పెంచడం ముఖ్యమైనది అని నిపుణులు సూచిస్తున్నారు.

    కేంద్రం ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్‌ 2025

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    బడ్జెట్‌ 2025

    Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా? బిజినెస్
    New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?   బిజినెస్
    Budget : బడ్జెట్ 2025.. ఆదాయ శ్లాబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా?  పన్ను
    Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025