NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / UPI transactions: యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    UPI transactions: యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ 
    యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ

    UPI transactions: యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మనమెప్పుడైనా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు, ఆ లావాదేవీ పూర్తవ్వడానికి కొంత సమయం పడుతుంది.

    ఉదాహరణకు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత "సక్సెస్‌" అనే సందేశం వచ్చే వరకూ మనం ఆ స్క్రీన్‌ను వ్యాపారి లేదా దుకాణదారుడికి చూపించి మాత్రమే అక్కడినుంచి వెళ్తాము.

    కొన్ని సందర్భాల్లో ఆ సందేశం వచ్చేంతవరకూ ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

    ఇకపై ఆ సమయం సగానికి తగ్గబోతోంది. ఈ కొత్త మార్పులు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి.

    యూపీఐ వ్యవస్థకు సంబంధించి వివిధ లావాదేవీల గడువును సవరించినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఒక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది.

    వివరాలు 

    వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ మార్పులు

    ఒక లావాదేవీ పూర్తయ్యేంతవరకూ గడిచే సమయాన్ని 'రెస్పాన్స్ టైమ్' అని పిలుస్తారు.

    మనం ఏదైనా చెల్లింపు చేస్తే, దాని ఫలిత సందేశం (సక్సెస్, ఫెయిల్, రివర్స్‌డ్ మొదలైనవి) వచ్చేంతవరకూ అది సమయంగా పరిగణించబడుతుంది.

    ఎన్‌పీసీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం, ఇప్పటివరకు 30 సెకన్లు పట్టిన క్రెడిట్ లేదా డెబిట్ లావాదేవీలు ఇకపై కేవలం 15 సెకన్లలో పూర్తయ్యేలా మార్పులు చేశారు.

    ఇంతకే పరిమితం కాకుండా, ట్రాన్సాక్షన్ స్టేటస్, రివర్సల్‌, అడ్రస్ వాలిడేషన్ వంటి ప్రక్రియల సమయం కూడా 30 సెకన్ల నుండి 10 సెకన్లకు కుదించబడ్డది.

    వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఎన్‌పీసీఐ పేర్కొంది.

    వివరాలు 

     15 సెకన్లలో.. 

    ఈ మార్పులు పాటించేందుకు పేటీఎం, ఫోన్‌పే లాంటి యూపీఐ సేవలందించే సంస్థలు,బ్యాంకులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎన్‌పీసీఐ ఆదేశించింది.

    ఉదాహరణకి.. ఎస్‌బీఐ ఖాతాదారుడు, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న వ్యాపారికి, యోనో యాప్ ద్వారా చెల్లింపు చేసినట్టనుకుందాం. ఆ లావాదేవీ విజయవంతంగా పూర్తయ్యిందా లేదా అనేది ఐసీఐసీఐ బ్యాంక్ ధృవీకరించాలి. ఆ సమాచారం ఎన్‌పీసీఐ నెట్‌వర్క్ ద్వారా ఎస్‌బీఐ వినియోగదారుడికి చూపించాలి.

    ఇప్పటివరకు దీనికి 30 సెకన్లు పట్టేది.

    జూన్ 16 నుంచి అదే ప్రక్రియ 15 సెకన్లలో పూర్తవుతుంది. ఇది కేవలం చెల్లింపుల లావాదేవీలకే పరిమితం కాదు.

    ఇతర యూపీఐ లావాదేవీల వేళ కూడా గణనీయంగా తగ్గనుందని, డిజిటల్ పేమెంట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూపీఐ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    యూపీఐ

    UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌  తాజా వార్తలు
    UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి  యూపీఐ పేమెంట్స్
    New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే యూపీఐ పేమెంట్స్
    UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు! ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025