తదుపరి వార్తా కథనం

Mark Zuckerberg: మెటాలో సెన్సార్షిప్ విధానాలను సవరించినట్లు సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటన
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 08, 2025
11:49 am
ఈ వార్తాకథనం ఏంటి
నకిలీ, హానికర సమాచారాన్నిఅరికట్టేందుకు అనుసరిస్తున్న సెన్సార్షిప్ విధానాల్లో మెటా సంస్థ గణనీయమైన మార్పులు చేసింది. ఫ్యాక్ట్చెకర్లను తమ విధానాల నుంచి తొలగించడం ద్వారా ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్నట్టు Meta సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. దీనితో,అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించబోయే డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. జుకర్బర్గ్ మాట్లాడుతూ,''ప్రస్తుత పరిస్థితిలో సెన్సార్షిప్ అధికంగా పెరిగింది.అందువల్ల మేము మా తప్పులను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టుకుంటాం.మా విధానాలను సులభతరం చేసి, స్వేచ్ఛా వ్యక్తీకరణను తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటాం''అని చెప్పారు. జుకర్బర్గ్ ప్రకటన వెలువడిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరించారు.