Loading...
IT Stocks Rally: ఐటీ రంగంలో కొనుగోళ్ల సందడి.. లాభాల్లో హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్ మహీంద్రా షేర్లు
ఐటీ రంగంలో కొనుగోళ్ల సందడి.. లాభాల్లో హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్ మహీంద్రా షేర్లు

IT Stocks Rally: ఐటీ రంగంలో కొనుగోళ్ల సందడి.. లాభాల్లో హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్ మహీంద్రా షేర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం ఐటీ షేర్లు బలంగా పుంజుకున్నాయి. వరుసగా రెండు రోజులుగా కొనసాగిన నష్టాలకు చెక్ పెడుతూ ఐటీ రంగంలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ 0.94 శాతం పెరిగి 28,799.25 వద్దకు చేరుకోగా,బీఎస్‌ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీ 0.74శాతం లాభపడి 27,883.81 వద్ద ట్రేడైంది. ఈ ర్యాలీకి హెచ్‌సీఎల్‌టెక్‌ ప్రధాన బలంగా నిలిచింది.నిఫ్టీ ఐటీ సూచీలోని కంపెనీల్లో హెచ్‌సీఎల్‌టెక్‌ షేరు 2శాతానికి పైగా ఎగసి టాప్ గెయినర్‌గా నిలిచింది. టెక్ మహీంద్రా,ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేర్లు వరుసగా 1.4శాతం,1.36 శాతం మేర లాభపడ్డాయి. విప్రో,ఎంఫాసిస్‌ షేర్లు ఒక్కొక్కటి 1శాతానికి పైగా పెరిగాయి. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ (OFSS) షేరు కూడా స్వల్పంగా 1 శాతానికి పైగా లాభపడింది.

వివరాలు 

లాభాల్లో ప్రధాన మార్కెట్ సూచీలు

ఐటీ షేర్లలో నమోదైన ఈ కొనుగోళ్ల ప్రభావంతో ప్రధాన మార్కెట్ సూచీలు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి.

ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 184 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ50 సూచీ 42 పాయింట్లకు పైగా లాభపడింది.

మరోవైపు, బీఎస్‌ఈ ఐటీ సూచీలోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది. ఎల్‌టీఎస్‌ఎస్‌ (LTTS) షేరు 2.92 శాతం పెరిగి అత్యధిక లాభం నమోదు చేసింది.

హెచ్‌సీఎల్‌టెక్‌ (2.14%), జెన్‌సార్ టెక్నాలజీస్‌ (2.18%), బిర్లాసాఫ్ట్‌ (1.61%), ఏఎస్‌ఎం టెక్నాలజీస్‌ (1.51%) షేర్లు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి.

టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, విప్రో, టాటా ఎల్క్సీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు కూడా 1 శాతానికి పైగా పెరిగి రంగానికి బలాన్నిచ్చాయి.

వివరాలు 

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు.. అప్రమత్తంగా ఇన్వెస్టర్లు 

అయితే ఐటీ రంగం బలంగా రాణించినప్పటికీ, మొత్తం మార్కెట్‌లో లాభాలు పరిమితంగానే నమోదయ్యాయి.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉంచుతున్నాయి.

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు, ఇరాన్ పోర్టులపై నావికా దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేయడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగే అవకాశం ఉందనే ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

ADVERTISEMENT