LOADING...
Mega 158 : 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ నుంచి మరో మెగా ట్రీట్‌.. కాన్సెప్ట్‌ పోస్టర్‌తో హైప్ పీక్స్‌లో!
'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ నుంచి మరో మెగా ట్రీట్‌.. కాన్సెప్ట్‌ పోస్టర్‌తో హైప్ పీక్స్‌లో!

Mega 158 : 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ నుంచి మరో మెగా ట్రీట్‌.. కాన్సెప్ట్‌ పోస్టర్‌తో హైప్ పీక్స్‌లో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి భారీ యాక్షన్‌ డ్రామాతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం నిలిచింది. చిరు జన్మదినం సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్‌ నెలకొంది. 'వాల్తేరు వీరయ్య' సక్సెస్‌ తర్వాత బాబీ-చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ మాస్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్‌ పోస్టర్‌లో 'బ్లడీ బెంచ్‌మార్క్‌ సెట్ చేసిన బ్లేడ్‌' అనే ట్యాగ్‌లైన్‌ మెగా మాస్‌ ఫ్యాన్స్‌ ఊపిరి ఆడనివ్వడం లేదు. రక్తంతో తడిసిన చిలుక ఆకారం, గొడ్డలి డిజైన్‌ చూసి ఈ చిత్రం రస్టిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాగా ఉండబోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Details

మరో స్టార్ హీరో నటించే అవకాశం

ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో స్టార్‌ హీరో కూడా నటించబోతున్నారని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, కోలీవుడ్‌ స్టార్‌ హీరో కార్తీ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని తమిళ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది కేవలం గెస్ట్‌ రోల్‌ కాదు, ఫుల్‌ లెంగ్త్‌ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ అని టాక్‌. చిరు - కార్తీ స్క్రీన్‌ షేర్‌ చేయబోతున్నారన్న వార్త మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. నాగార్జునతో కలిసి 'ఊపిరి' చిత్రంలో నటించిన కార్తీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరుతో కలిసి నటిస్తే, అది ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Detals

2027 నాటికి రిలీజ్ చేసేందుకు సిద్ధం

'చిరు-బాబీ 2' చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ, లోహిత్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉంది. హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌ నటించనున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్‌ యాక్టర్‌-డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్‌. సంగీతాన్ని ఎస్‌. థమన్‌ అందిస్తున్నారు. ఇటీవలే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించారు. 'మెగా 158' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో షూటింగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్రబృందం ప్రకారం, త్వరలోనే పూర్తి వివరాలు, నటీనటుల అధికారిక జాబితాను ప్రకటించనున్నారు.