Page Loader
Allu Aravind: త్వరలోనే కోలుకుంటాడు.. శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌
త్వరలోనే కోలుకుంటాడు.. శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

Allu Aravind: త్వరలోనే కోలుకుంటాడు.. శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప-2' రిలీజ్‌ రోజు సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రిలో కాలాన్ని గడిపిన ఆయన, కొద్దీ రోజుల క్రితం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఇంకా పూర్తిగా కోలుకునేందుకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు అల్లు అరవింద్‌ స్వయంగా శ్రీతేజ్‌ను పరామర్శించారు. రీహాబ్ సెంటర్‌కు వెళ్లిన ఆయన, అక్కడి డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Details

శ్రీ తేజ్ ఆకౌంట్లలో రూ.2 కోట్లు డిపాజిట్

అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, ''శ్రీతేజ్‌ కోలుకోవడాన్ని మా కుటుంబం అంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. రోజురోజుకూ మెరుగవుతున్న ఆరోగ్య పరిస్థితి మనందరినీ ఊరట కలిగిస్తోంది. డాక్టర్లతో మాట్లాడితే ఆయన చికిత్సకు మంచి స్పందన ఇస్తున్నాడని చెప్పారని అన్నారు. అలాగే శ్రీతేజ్‌ చికిత్స ఖర్చుల కోసం హీరో అల్లు అర్జున్‌ ఇప్పటికే రూ.2 కోట్లు అతడి ఖాతాలో డిపాజిట్‌ చేసిన విషయం గుర్తుచేసుకుంటే, అల్లు కుటుంబం ఎంతగా ఈ విషయంలో సహకరిస్తుందో తెలుస్తోంది. 'త్వరలోనే శ్రీతేజ్‌ మన అందరిలా సాధారణంగా తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఉన్నానని అల్లు అరవింద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.