Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ను గతంలోనే ప్రకటించడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్పై ఓ అనూహ్యమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన తాజా కామెంట్స్ ఈ ప్రాజెక్ట్పై అనుమానాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్తో 'స్పిరిట్' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'యానిమల్'కు సీక్వెల్గా 'యానిమల్ పార్క్' ఉంటుందని ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు.
వివరాలు
ప్రత్యేకమైన బ్రాండ్..
మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందనే హింట్ ఇచ్చారు.
అయితే అల్లు అర్జున్తో గతంలో ప్రకటించిన సినిమా గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఉంటుందని కచ్చితంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దీంతో బన్నీ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ హోల్డ్లో పడిందా? అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే చర్చ మొదలైంది.
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోతే అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.
ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు. దీంతో ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వివరాలు
అట్లీ దర్శకత్వంలో రాకా..
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు.
ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్తో కూడా ఓ సినిమాను ప్రకటించారు. అలాగే ఇతర భాషలకు చెందిన పలువురు దర్శకులతోనూ బన్నీ వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బన్నీ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ భవిష్యత్తు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సందీప్ రెడ్డి వంగా తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. అల్లు అర్జున్తో ప్రకటించిన సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.