Loading...
Myanmar: మయన్మార్‌లో ఘోరం.. బౌద్ధ మఠంపై బాంబుల దాడి, 14 మంది మృతి!
మయన్మార్‌లో ఘోరం.. బౌద్ధ మఠంపై బాంబుల దాడి, 14 మంది మృతి!

Myanmar: మయన్మార్‌లో ఘోరం.. బౌద్ధ మఠంపై బాంబుల దాడి, 14 మంది మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం మరోసారి భీకర దాడికి పాల్పడింది. సెంట్రల్‌ సగాయింగ్‌ ప్రాంతంలోని ఓ బౌద్ధ మఠంపై సైనిక బలగాలు శుక్రవారం బాంబులతో దాడి చేశాయి. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మ్యాంగ్‌ టౌన్‌షిప్‌లోని స్వెల్‌ లీ ఓ గ్రామంలో ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక ప్రతిపక్ష సమూహం సీడీఎస్‌ఓఎం ప్రతినిధి న్వే ఓ తెలిపారు. బాధితులు మఠంలో ధ్యాన సాధనలో పాల్గొంటున్న సమయంలో యుద్ధ విమానం ద్వారా బాంబులు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడిలో మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

వివరాలు

భారీగా ప్రాణనష్టం

దాడి కారణంగా మఠం ప్రాంగణంలో భారీగా ప్రాణనష్టం సంభవించింది.

మయన్మార్‌లో ప్రజాస్వామ్య అనుకూల శక్తులు, సాయుధ తిరుగుబాటు సమూహాలను లక్ష్యంగా చేసుకుని సైన్యం ఇటీవలి కాలంలో వైమానిక దాడులను ముమ్మరం చేసింది.

ఈ క్రమంలోనే బౌద్ధ మఠంపై దాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

ADVERTISEMENT