
Danush : కుబేరా జోరు కొనసాగిస్తూనే.. వెంకీ అట్లూరితో ధనుష్ నెక్స్ట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'కుబేరా' సినిమా గతవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో రన్ అవుతూ అంచనాలను మించి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. రిలీజ్ అయిన వెంటనే 'మూవీ అదిరిపోయింది... అసలు ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు!' అని ప్రేక్షకులు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు. వర్కింగ్ డేస్లోనూ మంచి రన్ కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక మెగా బ్లాక్బస్టర్గా అవతరించి, తెలుగుసినిమా చరిత్రలో కొత్త అధ్యాయం రాస్తోంది.
Details
ఆనందంలో ధనుష్ ఫ్యాన్స్
'కుబేరా'. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో హీరో ధనుష్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఆయన నటించిన రెండో సినిమా కూడా విజయవంతం కావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 'కుబేరా' తరువాత ధనుష్ తదుపరి తెలుగు సినిమా ఎవరితో చేస్తారనేది సినీ ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది. ధనుష్ తన తొలి తెలుగు చిత్రం 'సార్' ద్వారా బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరితో మరోసారి చేతులు కలపనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2027లో సెట్స్ పైకెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందన్న వార్తలతో ప్రాజెక్ట్పై ఇప్పటినుండే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.