
అఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుంది.
కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన రాజావారు, రాణీగారు సినిమా దర్శకుడితో ఈ సినిమా ఉండనుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది.
రాజావారు రాణీగారు సినిమాతో ప్రేక్షకులను అలరించిన రవి కిరణ్ కోలా దర్శకుడితో తమ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఈ సినిమాలో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి చేయలేదు. ఏ జోనర్ లో సినిమా రూపొందుతుందనేది కూడా తెలియజేయలేదు.
రాజావారు రాణీగారు వంటి ప్రేమ కథా చిత్రంతో ఆకట్టుకున్న రవి కిరణ్ కోలా, ఈసారి ఎలాంటి కథను తీసుకువస్తున్నాడో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ ట్వీట్
Happy to announce our upcoming project with @storytellerkola, the director who captured our hearts with #RajaVaaruRaniGaaru. Stay tuned for more updates… pic.twitter.com/aLfkgcIOdr
— Sri Venkateswara Creations (@SVC_official) September 25, 2023