NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Ranbir Kapoor : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు.. ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    Ranbir Kapoor : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు.. ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం
    ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం

    Ranbir Kapoor : బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ సమన్లు.. ఈనెల 6న హాజరుకావాలని ఆదేశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 04, 2023
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది.

    ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

    ఇటీవలే మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు బహిర్గతమయ్యాయి. బెట్టింగ్‌ యాప్‌ మాటున ఈ భారీ కుంభకోణాన్ని ఇటీవలే ఈడీ రట్టుచేసింది.

    ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ యూఏఈలోని దుబాయ్‌ కేంద్రంగా మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను చేపట్టారు.

    ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ జరుగుతోందన్న ఈడీ, బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ అకౌంట్లకు తరలించేందుకు హావాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    details

    మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను సీజ్‌ చేసిన ఈడీ

    మరోవైపు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు బెట్టింగ్‌ యాప్‌ భారీగా ప్రకటనల కోసం ఖర్చు చేసినట్టు ఈడీ తెలిపింది.

    కోల్‌కతా, భోపాల్‌, ముంబై లాంటి నగరాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ, మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను సీజ్‌ చేసింది.

    మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరైన సౌరభ్‌ చంద్రఖర్‌ వివాహం ఫిబ్రవరిలో యూఏఈలో నిర్వహించగా రూ.200 కోట్లు ఖర్చు చేశారు.

    వేడుకకు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ,నేహా కక్కర్‌, అతిఫ్‌ అస్లమ్‌,రహత్‌ ఫతేహ్‌ అలీఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితరులు హాజరయ్యారు.

    ఈ నేపథ్యంలోనే రణ్‌బీర్‌ కు సమన్లు జారీ అయ్యాయి. మరో 17 మంది సెలబ్రిటీలపై ఈడీ నిఘా ఉంచినట్లు సమాచారం. త్వరలోనే వీరికి సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బాలీవుడ్

    మహాభారత్ సీరియల్ లో శకుని మామ పాత్రలో కనిపించిన నటుడు కన్నుమూత  సినిమా
    పరిణీతి చోప్రా, రాఘవ చద్దా వివాహ వేడుకకు ముస్తాబవుతున్న ఉదయ్ పూర్ రాజభవనం  సినిమా
    మధు మంతెన పెళ్ళి వేడుకకు హాజరైన అల్లు అర్జున్, హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్; వైరల్ అవుతున్న ఫోటోలు  అల్లు అర్జున్
    బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే నెపోటిజం ఎక్కువ: ఉయ్యాల జంపాల హీరోయిన్ కామెంట్లు వైరల్  తెలుగు సినిమా

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు లాలూ ప్రసాద్ యాదవ్
    రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై కల్వకుంట్ల కవిత
    దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత కల్వకుంట్ల కవిత
    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025