Loading...
Sarath Chandra Naidu : అల్లు అర్జున్ మేనేజర్ నుంచి నిర్మాతగా.. 'గుర్తుకొస్తున్నాయి' సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
అల్లు అర్జున్ మేనేజర్ నుంచి నిర్మాతగా.. 'గుర్తుకొస్తున్నాయి' సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!

Sarath Chandra Naidu : అల్లు అర్జున్ మేనేజర్ నుంచి నిర్మాతగా.. 'గుర్తుకొస్తున్నాయి' సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ మేనేజర్‌గా, పలు చిత్రాలకు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌గా గుర్తింపు పొందిన శరత్ చంద్ర నాయుడు ఇప్పుడు నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన నిర్మించిన తొలి వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను 90s కిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ చంద్ర నాయుడు నిర్మించగా, వినోద్ గాలి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 90వ దశకానికి చెందిన జ్ఞాపకాలతో ఈ సిరీస్ 90స్ కిడ్స్‌ను బలంగా ఆకట్టుకుంటోంది.

వివరాలు

ఆ కంటెంట్‌కు మంచి ఆదరణ

ఈ విజయాన్ని పురస్కరించుకుని శరత్ చంద్ర నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'గుర్తుకొస్తున్నాయి' వెబ్ సిరీస్ ఎలా పుట్టిందనే విషయాన్ని ఆయన వెల్లడించారు.

తన ఇన్‌స్టాగ్రామ్ పోడ్‌కాస్ట్ పేజ్ 'రేలంగి మావయ్య' నుంచే ఈ ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు.

ఆ పోడ్‌కాస్ట్‌లో 90వ దశకానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను తన వాయిస్ ఓవర్‌తో పంచుకునేవాడినని, ఆ కంటెంట్‌కు మంచి ఆదరణ లభించిందన్నారు.

అదే కంటెంట్‌ను చూసిన ఈటీవీ విన్‌కు చెందిన సాయి, నితిన్.. ఈ భావోద్వేగాలను వెబ్ సిరీస్‌గా రూపొందిస్తే బాగుంటుందని సూచించడంతో 'గుర్తుకొస్తున్నాయి' రూపుదిద్దుకుందని వివరించారు.

వివరాలు

అల్లు అర్జున్ ఎంతో సంతోషించారు

ఈ సందర్భంగా అల్లు అర్జున్ గురించి కూడా శరత్ చంద్ర నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిర్మాతగా తన కొత్త ప్రయాణానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి లభించిన ప్రోత్సాహం ఎంతో ప్రత్యేకమని తెలిపారు.

వ్యక్తిగతంగా అభినందించడమే కాకుండా సోషల్ మీడియాలో ట్వీట్ చేసి తనను ప్రోత్సహించారని చెప్పారు.

తన వద్ద పనిచేసిన వారిలో ఒకరు నిర్మాతగా మారడం చూసి అల్లు అర్జున్ ఎంతో సంతోషించారని, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తారని కొనియాడారు.

సినీ నిర్మాణ రంగంలో తన కొత్త అధ్యాయానికి ఇదే శ్రీకారం అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఆ అనుభవమే ఉపయోగపడింది

అలాగే, డిజిటల్ మార్కెటింగ్‌లో తనకు ఉన్న అనుభవం ఈ వెబ్ సిరీస్ విజయానికి బాగా ఉపయోగపడిందని శరత్ చంద్ర నాయుడు వెల్లడించారు.

ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారు, వారిని ఏ అంశాలు ఎక్కువగా ఆకట్టుకుంటాయో తనకు ముందే అవగాహన ఉండటంతో ఆ అనుభవాన్ని ఈ సిరీస్‌కు వినియోగించుకున్నానన్నారు.

ప్రస్తుతం ఈ సిరీస్‌కు అనూహ్యమైన స్పందన వస్తోందని తెలిపారు.

నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా దర్శకుడు, రచయితల బృందంతో కలిసి కథ, స్క్రీన్‌ప్లేలోని పలు భాగాల రచనలో కూడా తాను భాగస్వామ్యం అయ్యానని వెల్లడించారు.

ADVERTISEMENT