
SSMB29: మహేష్ బాబు కంటే ప్రియాంక చోప్రాకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న జక్కన్న?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించనుంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. జుట్టు పెంచి, గుబురు గడ్డంతో, జిమ్లో కసరత్తు చేసి మరింత ఫిట్ అయ్యారు. ఇందులో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.
Details
మూవీపై భారీ అంచనాలు
SSMB29 మహేశ్ బాబుకు తొలి పాన్-ఇండియా సినిమా కావడం వల్ల అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. తాజా టాక్ ప్రకారం, రాజమౌళి, ప్రియాంక చోప్రాపై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్, మహేశ్ బాబుకు ఇచ్చిన మొత్తాన్ని మించవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది.