తదుపరి వార్తా కథనం

Mahesh Babu: దర్శకుడు మహేశ్ బాబుకు బాపు-రమణ పురస్కారం
వ్రాసిన వారు
Stalin
Apr 10, 2024
04:21 pm
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్కశెట్టి,నవీన్ తో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పి. మహేష్ బాబుకు బాపు -రమణ పురస్కారం లభించింది.
ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ వారు బాపు-రమణల పురస్కారాన్ని మహేష్కు అందజేశారు.
సెన్సిటివ్ కథాంశంతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ కూడా పొందారని దర్శకుడిని వారు అభినందించారు.
గతేడాది మంచి టాక్ ను సంపాదించుకున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో నవ్వించింది.
అనుష్క రీఎంట్రీతో ఓపెనింగ్స్ సంపాదించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో లాభాలు తెచ్చిపెట్టింది.
బాపు- రమణ పురస్కారం తనకు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని, తనపై బాధ్యతను పెంచిందని దర్శకుడు తెలిపారు.
మీరు పూర్తి చేశారు