LOADING...
Mohan Babu: గుజరాత్ సీఎంతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ
గుజరాత్ సీఎంతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ

Mohan Babu: గుజరాత్ సీఎంతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు మోహన్‌ బాబు, మంచు విష్ణు, శరత్‌కుమార్‌లతో కలిసి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు. ఈ ఉదయం గుజరాత్‌లో జరిగిన ఈ సమావేశంలో మోహన్‌బాబు తెలుగులో కళాకారుడు రమేశ్‌ గొరిజాల వేసిన ఒక పెయింటింగ్‌ను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు బహుమతిగా అందించారు. ఈ ఫొటోలను పంచుకుంటూ, మోహన్‌బాబు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. మోహన్‌బాబు తన పోస్ట్‌లో విష్ణు, శరత్‌కుమార్‌లతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రిని కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Details

సీఎంకు విష్ణు బహుమతి

ఆయన తన విలువైన సమయాన్ని తమ కోసం కేటాయించడం సంతోషకరమన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా విష్ణు ఆయనకు ఒక పెయింటింగ్‌ను బహుమతిగా అందించారు. డైనమిక్‌ లీడర్‌గా గుజరాత్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, ఆయన ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Advertisement