LOADING...
Saraswathi Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన 'ఎస్‌. సరస్వతి'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన 'ఎస్‌. సరస్వతి'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Saraswathi Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన 'ఎస్‌. సరస్వతి'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఎస్‌. సరస్వతి' తాజాగా సైలెంట్‌గా ఓటిటిలోకి అడుగుపెట్టింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాలో జీవా, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు.

వివరాలు

కథ వివరాలు

ఈ సినిమా కథ లక్ష్మి (వరలక్ష్మి శరత్‌కుమార్) అనే అనాథ మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కూతురు ఎస్‌. సరస్వతిని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఆగస్టు 15న ఆమె తన కూతురిని స్కూల్‌కు దించి పనికి వెళ్లిపోతుంది. అయితే సాయంత్రం తిరిగి వచ్చేసరికి సరస్వతి కనిపించదు. దీనిపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించిన లక్ష్మికి షాకింగ్ సమాధానం లభిస్తుంది. ఆమె చెప్పిన క్లాస్‌లో సరస్వతి అనే విద్యార్థి ఎవరూ లేరని వారు స్పష్టం చేస్తారు. ఈ పరిణామంతో కలవరపడిన లక్ష్మి, మరుసటి రోజే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారని, ఆ తర్వాత శవాన్ని తానే ఒక చోట పాతిపెట్టినట్లు చెబుతుంది.

వివరాలు

న్యాయం కోసం ఎలా పోరాడింది?

అయితే పోలీసులు ఆమె చెప్పిన ప్రదేశంలో తవ్వి చూసినా ఎలాంటి శవం కనిపించదు. దీంతో ఎలాంటి ఆధారాలు లేవనే కారణంతో కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తారు. న్యాయం కోసం లక్ష్మి న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్) సహాయంతో కోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా సాక్ష్యాల లేమితో కేసు కొట్టివేస్తారు. ఈ పరిస్థితుల్లో, తన కూతురి హత్యకు బాధ్యులని భావిస్తూ లక్ష్మి ఒక జడ్జి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక పోలీస్ అధికారిని హత్య చేస్తుంది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? లక్ష్మి అసలు నిజం ఏమిటి? ఆమె గతం ఏంటి? అన్నది సినిమా చూస్తేనే తెలియనుంది.

Advertisement