LOADING...
mana shankara vara prasad garu: సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' టీవీ ప్రీమియర్‌కు రెడీ
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' టీవీ ప్రీమియర్‌కు రెడీ

mana shankara vara prasad garu: సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' టీవీ ప్రీమియర్‌కు రెడీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతికిప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బ్లాక్‌బస్టర్ చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో చాలా సినిమాలను ఒకేసారి ఓటీటీతో పాటు టీవీలో కూడా ప్రసారం చేస్తున్న జీ నెట్‌వర్క్, ఈ చిత్రాన్ని మాత్రం ముందుగా ఓటీటీలో విడుదల చేసి, అనంతరం కొంత విరామం తర్వాత టెలివిజన్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించింది.

వివరాలు 

మన శంకరవరప్రసాద్ గారు వరల్డ్ టీవీ ప్రీమియర్

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ హై-ఎనర్జీ యాక్షన్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థియేటర్లలోనే కాకుండా జీ5 ఓటీటీలో కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం జీ తెలుగు (Zee Telugu) ఛానెల్‌లో ఫిబ్రవరి 28 శనివారం సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ టీవీ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. థియేటర్లలో లేదా ఓటీటీలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇది ఒక మంచి అవకాశం.

వివరాలు 

ఓటీటీలో సూపర్ హిట్‌గా కొనసాగుతున్న మెగా ఎంటర్‌టైనర్

ఫిబ్రవరి 11న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సినిమా, 500 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించింది. విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో శంకర వర ప్రసాద్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో మెప్పించారు. అలాగే విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి ప్రత్యేక పాత్రలో కనిపించగా, క్యాథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ నటనతో సినిమాకు మరింత బలం చేకూర్చారు.

Advertisement

వివరాలు 

జీ5 ఓటీటీలో తెలుగు సహా మొత్తం ఏడు భాషల్లో..

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు హైలైట్‌గా నిలిచాయి. సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు చేసిన కట్టింగ్ ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం జీ5 ఓటీటీలో తెలుగు సహా మొత్తం ఏడు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. టీవీ ద్వారా ఆస్వాదించాలనుకునే వారు ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో వీక్షించవచ్చు.

Advertisement