Smriti mandhana: 300 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసిన స్మృతి మంధాన.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరో అరుదైన మైలురాయిని అందుకుంది. కేవలం 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లో 300 మ్యాచ్లు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలైన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. స్మృతి మంధాన ఇప్పటివరకు భారత్ తరఫున 9 టెస్టులు, 120 వన్డేలు, 171 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేలకుపైగా పరుగులు నమోదు చేసింది. ఆమె ఖాతాలో ఇప్పటికే 17 సెంచరీలు, 74 అర్ధశతకాలు ఉన్నాయి. 2013లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన మంధాన, అప్పటి నుంచి జట్టుకు కీలక బ్యాటర్గా కొనసాగుతోంది.
వివరాలు
లార్డ్స్ టెస్టులో మంధాన అర్ధశతకం.. షఫాలీ నిరాశ
ఇంగ్లాండ్ మహిళల జట్టుతో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత ప్రదర్శనతో అర్ధశతకం నమోదు చేసింది. అయితే మరో ఓపెనర్ షఫాలీ వర్మ మాత్రం ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా 12 పరుగులు చేసి ఎక్కువసేపు నిలవలేక పెవిలియన్ చేరింది.
వివరాలు
జెమీమా రోడ్రిగ్స్ దూకుడు..
అనంతరం బ్యాటింగ్కు దిగిన జెమీమా రోడ్రిగ్స్ దూకుడుగా ఆడి 35 పరుగులు చేసింది. మంధానతో కలిసి మూడో వికెట్కు అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే వాంగ్ బౌలింగ్లో ఆఫ్సైడ్కు వెళ్తున్న బంతిని ఆడే ప్రయత్నంలో జెమీమా బౌల్డ్ అయింది. తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అప్పటికి స్మృతి మంధాన 56 పరుగులతో నాటౌట్గా ఉండగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 14 పరుగులతో క్రీజులో కొనసాగుతోంది.