
Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు.
హైదరాబాద్లో నివాసం ఉంటున్న జయదేవ్కు రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటి మృతి చెందిన వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
జయదేవ్ 2022లో 'కోరంగి నుంచి' అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
దీన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డిసి) నిర్మించింది.
'సురభి', 'జనని', 'ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు-ది మ్యాన్ హూ నోస్ ది ఫ్యూచర్' వంటి శీర్షికలతో సహా అనేక డాక్యుమెంటరీలను రూపొందించారు. జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కె.ఎన్.టి. శాస్త్రి చిన్న కొడుకే కె.జయదేవ్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టాలీవుడ్లో విషాదం
#Tollywood : టాలీవుడ్ లో మరో విషాదం..గుండెపోటుతో డైరెక్టర్ మృతి?#director #jayadev #telugufilmnagar #HashtagUhttps://t.co/uoZnGDM8KF
— Hashtag U (@HashtaguIn) January 9, 2024