Page Loader
Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి 
Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి

Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి 

వ్రాసిన వారు Stalin
Jan 09, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న జయదేవ్‌కు రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటి మృతి చెందిన వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జయదేవ్ 2022లో 'కోరంగి నుంచి' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. దీన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డిసి) నిర్మించింది. 'సురభి', 'జనని', 'ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు-ది మ్యాన్ హూ నోస్ ది ఫ్యూచర్' వంటి శీర్షికలతో సహా అనేక డాక్యుమెంటరీలను రూపొందించారు. జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కె.ఎన్.టి. శాస్త్రి చిన్న కొడుకే కె.జయదేవ్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టాలీవుడ్‌లో విషాదం