LOADING...
Karuppu: త్రిషనే బెస్ట్ ఛాయిస్ అనిపించింది.. ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
త్రిషనే బెస్ట్ ఛాయిస్ అనిపించింది.. ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

Karuppu: త్రిషనే బెస్ట్ ఛాయిస్ అనిపించింది.. ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడిగా ప్రేక్షకులను అలరించిన అర్జే బాలాజీ, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. 'మూకుతి అమ్మన్‌' (అమ్మోరు తల్లి), 'వీట్ల విశేషం' తర్వాత ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా మే 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాజీ, హీరోయిన్ ఎంపికతో పాటు సంగీత దర్శకుడి ఎంపికపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "గతంలోనే త్రిషతో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. కానీ అది అప్పట్లో సాధ్యపడలేదు. అందుకే 'కరుప్పు' కోసం ఆమెను సంప్రదించాను. కథ వినగానే ఆమెకు బాగా నచ్చింది. ముఖ్యంగా తన పాత్ర ఆమెను ఆకట్టుకుంది. అందుకే వెంటనే అంగీకరించింది.

వివరాలు

22 ఏళ్ల తర్వాత జోడి

తన పాత్ర షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా మాతో కలిసి సెట్స్‌కి వచ్చేది. 'ఆరు' సినిమా తర్వాత దాదాపు 22 ఏళ్లకు సూర్య-త్రిష జోడీ మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించిందని చెప్పారు. బాలాజీ మాట్లాడుతూ.. " 'మూకుతి అమ్మన్‌' విడుదలైన తర్వాత నేను ఎ. ఆర్. రెహమాన్‌ను కలిశాను. అప్పుడే కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. కొంతకాలం తర్వాత 'కరుప్పు' కోసం ఆయనను మళ్లీ సంప్రదించాను. 'నేను ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేనని భావిస్తున్నాను. పైగా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలి?' అని ఆయన చెప్పడంతో నాకు కొంత నిరాశ కలిగింది. చివరకు సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేశానని వెల్లడించారు.

Advertisement