Loading...
Menakuru: మేనకూరులో రూ.1,250 కోట్ల అయస్కాంతాల పరిశ్రమకు శ్రీకారం
మేనకూరులో రూ.1,250 కోట్ల అయస్కాంతాల పరిశ్రమకు శ్రీకారం

Menakuru: మేనకూరులో రూ.1,250 కోట్ల అయస్కాంతాల పరిశ్రమకు శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామికవాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో నియోడైమియం ఐరన్ బోరాన్ (NdFeB) అయస్కాంతాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఎన్‌ఏఎన్‌ గ్రీన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ పరిశ్రమలకు అవసరమైన ఈ ప్రత్యేక అయస్కాంతాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా,ఈ పరిశ్రమ ప్రారంభమైతే దేశీయంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం మరింత పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక ప్రోత్సాహక చర్యల ఫలితంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు,ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు (PCB) వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయి. అదే క్రమంలో ఈ అయస్కాంతాల తయారీ పరిశ్రమ కూడా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగుగా నిలవనుంది.

వివరాలు 

అవసరమైన ఖనిజ వనరులు అందుబాటులో ఉండటం ప్రాజెక్టుకు మరింత బలం

ఈ పరిశ్రమకు అవసరమైన ఖనిజ వనరులు రాష్ట్రంలోనే అందుబాటులో ఉండటం ప్రాజెక్టుకు మరింత బలంగా మారింది.

మేనకూరులో ఇప్పటికే లిథియం-అయాన్‌ బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న ఎన్‌ఏఎన్‌ గ్రీన్‌మెంట్‌, దానికి అనుబంధంగా ఈ అయస్కాంతాల తయారీ పరిశ్రమను కూడా నెలకొల్పనుంది.

ఇందుకోసం ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించింది.

వివరాలు 

మొదటి దశలో ఏడాదికి 1,200 టన్నుల ఉత్పత్తి

మొదటి దశలో ఏడాదికి 1,200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను ప్రారంభించి, అనంతరం దానిని 10 వేల టన్నుల సామర్థ్యానికి విస్తరించే ప్రణాళికను సంస్థ రూపొందించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి అవసరమైన కీలక ముడి పదార్థాలను దేశీయంగానే ఉత్పత్తి చేయడం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఈ పరిశ్రమ కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

ADVERTISEMENT