NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు
    11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు

    Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో యాసంగి సీజన్‌ వరి కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో,కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుతోంది.

    ఈ సీజన్‌లో మొత్తం 1.37 కోట్ల టన్నుల వరి దిగుబడి ఉంటుందని అంచనా వేయగా,ఇందులో 70.13 లక్షల టన్నులను ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    రాష్ట్రంలోని హైదరాబాద్‌ను తప్పించి మిగిలిన 32 జిల్లాల్లో మొత్తం 7,981 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

    ఇప్పటి వరకూ మొత్తం 11.70 లక్షల టన్నుల వరి రైతుల నుంచి సేకరించారు.ఏప్రిల్‌ 24వ తేదీ వరకు రైతుల నుంచి సేకరించిన ఈ వరికి ప్రభుత్వం రూ.2,714.26 కోట్ల విలువ చెల్లించాల్సి ఉంది.

    ఇందులో రూ.817.86 కోట్లను ఇప్పటికే రైతులకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

    వివరాలు 

    4.71 లక్షల టన్నుల వరి సేకరణ

    మిగతా మొత్తాన్ని త్వరలోనే సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.

    సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ అందిస్తున్న కారణంగా, దొడ్డు, సన్న వడ్లను వేరుచేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

    ధాన్యం కొనుగోళ్లలో ముందంజలో ఉన్న జిల్లాల్లో నిజామాబాద్, నల్గొండ, కామారెడ్డి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

    నిజామాబాద్‌లో అత్యధికంగా రూ.1,094.07 కోట్ల విలువైన 4.71 లక్షల టన్నుల వరి సేకరణ జరిగింది.

    అక్కడ 7.09 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించారు.

    నల్గొండ జిల్లాలో రూ.502.45 కోట్ల విలువైన 2.16 లక్షల టన్నుల వరి కొనుగోలు చేయగా, కామారెడ్డిలో రూ.261.39 కోట్ల విలువైన 1.12 లక్షల టన్నులు సేకరించారు.

    వివరాలు 

    ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానీ జిల్లాలు ఇవే.. 

    ఇతరవైపు, ఆదిలాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.

    నాగర్‌కర్నూల్, భూపాలపల్లి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, కొన్ని కారణాల వల్ల కొనుగోళ్లు మొదలవ్వలేదని అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తెలంగాణ

    Telangana Rains: తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వాతావరణ శాఖ
    Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌  భారతదేశం
    School Holidays: తెలంగాణలో వేసవి సెలవులు షురూ.. అధికారిక షెడ్యూల్ విడుదల! ఇంటర్
    Bhu Bharati Act Passbook: భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమానులకు పాస్‌బుక్ పొందే విధానం, ఫీజు వివరాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025