NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
    ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Stalin
    Jan 05, 2023
    03:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

    జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాతో కూడిన కూడిన ధర్మాసనం విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 50,000 మందిని రాత్రికి రాత్రే నిర్వాసితులను చేయలేమని చెప్పింది. రైల్వే భూముల్లో ప్రజలు దశాబ్దాలుగా నివసిస్తున్నారని పేర్కొన్న ధర్మాసనం.. సమస్యను మానవ కోణంతో ముడిపడి ఉన్నందని చెప్పింది. అందుకే.. వారికి పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

    సుప్రీంకోర్టు

    రాష్ట్రంలో రాజకీయ యుద్ధం

    హల్ద్వానీలో 29 ఎకరాల రైల్వే భూమిలోని ఆక్రమణలను తొలగించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పు.. రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి దారితీసింది. స్థానిక ప్రజలతో పాటు, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ పార్టీలు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    హల్ద్వానీలో రైల్వే భూమిల్లో అనుమతులు లేకుండా దశబ్దాలు 50వేల మంది నివసిస్తున్నారు. 4వేలపైగా ఇళ్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, మసీదులు, దేవాలయాలను అక్కడ నిర్మించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని 2013లో ఉత్తరాఖండ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. 2022లో దీనిపై తీర్పు ఇవ్వగా.. ప్రతివాదులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    సుప్రీంకోర్టు

    పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ భారతదేశం
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర మోదీ
    ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జమ్ముకశ్మీర్

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025